పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/460

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

453


మఱియు మొదలీయనేల నెమ్మదిగ ననఁగ
విని రమాదేవి హరిఁ జూచి వెలయఁ బల్కె.

146


క.

దేవా మీచిత్తమునం
దీవిధమునఁ దలఁచియుండి యీఋణ మిఁక నే
నేవిధమునఁ దీరుతు నని
యావేళ వినోదలీల నడిగిన దేలా.

147


క.

అనుచు రమాసతి యడుగఁగ
విని హరి యిట్లనియె నీవు విత్తము ప్రజకున్
ఘనముగ నిచ్చిన నది గై
కొనియెద నని నిన్ను వేడుకొంటిని లక్ష్మీ.

148


వ.

అనిన విని లక్ష్మీదేవి యిట్లనియె.

149


క.

మన మలరఁగ నే ద్రవ్యం
బనఘా నీ కిత్తుఁ దీర్చుమా ఋణ మనినన్
వినక పరస్పరముగ భూ
జనులకు నే నియ్య ననెడి సరణిం జెపుమా.

150


సీ.

అన విని మఱల నిట్లనియె నో ప్రాణేశ
        కలియందు నరు లెఫ్డు గఠినహృదయు
లగుచు దానములు సేయరు గాన జన్మజ
        న్మాంతరంబులను జంద్రాంశ నొంది
నశియింతు రటువంటి నరులకు ధనము నీ
        వీయు మటన్న నే నీయలేను
వరద నీ కెంతద్రవ్యంబైన నిచ్చెద
        నీవె వారల కిమ్ము నెనరు మించి