పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/459

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

452

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


కల్గఁగ వెఱచి తత్కాలంబుగా నన్నుఁ
        బేర్కొంచు కడు మొరల్ వెట్టునపుడు
వారియాపదలు నివారించి బ్రోవక
        నే నూరకుండుట నీతి గాదు
గనుక యానరుల దుష్కర్మము ల్వారి ద్ర
        వ్యంబుపై నాకర్షణంబు చేసి


తే.

వచ్చు నాపదలను దీర్చి వారిధనము
నేను గొండకుఁ దెప్పించి నిస్పృహుండ
నగుచుఁ దత్పాపరూప మైనట్టిధనము
మూఢజనులకు నిప్పింతు మొనసి వింటె.

144


తే.

ఎలమిఁ బుణ్యాత్ము లైనవా రిచ్చినట్టి
ధనమునం గొంతఁ గైకొని ధనధునకును
గొంత వడ్డికిఁ జెల్లించి వింతలీల
లెసఁగఁ జేయుట మేలంచం బొసఁగఁ బల్కి.

145


సీ.

మఱల నిట్లనె నో రమాదేవి ద్రవ్యంబు
        నెల్లవారికిని నీ విచ్చుచుండు
మాద్రవ్య మిచటికి నాకర్షణముచేసి
        సుజన దుర్జనుల కిచ్చుచుఁ గ్రమంబు
గాఁ బ్రభుత్వము నిందుఁ గడపుచు నీకలి
        కాలంబు మౌనంబులీల నడుప
వలయుఁ గావున ధనపతికి న ప్పిప్పుడ
        తీర్చఁగూడదని నేఁ దిరముగాను


తే.

వ్రాసియిచ్చితిఁ గడువిడి పత్ర మలర
దాని నిప్పుడఁ జెఱుపంగఁ దలఁప నేల