పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/452

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

445


అమృతాంశుసోదరి యార్తిదోషవిదారి
        నవ్యసుందరి సదానందలహరి
భక్తసజ్జనసాల పాపవనానల
        విహితాలవాల సద్వినయశీల
కనకపద్మాలయ కవివర్యగణగేయ
        విబుధనికాయ సద్విజయనిలయ


తే.

లక్ష్మి నీస్వామి వక్షస్స్థలంబునందుఁ
జేరి శేషాద్రిపై భూప్రసిద్ధముగను
వెలసి మామీఁద సత్కృప నిలుపవలయు
ననుచుఁ బ్రార్థించి వారిట్టు లనిరి మఱల.

121


సీ.

పరఁగఁ గార్తికశుద్ధపంచమీభృగువార
        ముత్తరాషాఢసంయుతదినంబు
చక్రివక్షమునందు సంతసంబునఁ జేర
        వలె మైత్రతారగ వఱలునాఁడు
తడవేల నంచు విధాత శంకరులును
        విన్నవింపంగ నావిజయలక్ష్మి
పలుకకుండినఁ జూచి బ్రహ్మదేవుఁడు భృగు
        సంయమీంద్రుని కనుసైగఁ జేసె


తే.

నపుడు భృగుముని సిరిపాలి కరిగి మ్రొక్కి
మాతృదేవత నాతప్పు మఱచి యిప్పు
డైన నే నీకుఁ బుత్రుండనంచు నెంచి
హరియురంబునఁ జేరు మాయమ్మ యనుచు.

122


క.

బహువిధముల వినుతింపఁగ
సహజజ్ఞానమున నధికసంతసమున శ్రీ