పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/448

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

441


క.

మీ రాదిమదంపతు లై
భూరిజగత్త్రయము నిట్లు పుట్టించినవా
రారయ నిపు డెడఁబాయను
గారణ మున్నందువలనఁ గార్యము గల్గెన్.

105


క.

వేంకటగిరిపై మీ రిపు
డంకితముగ నుండవలసినందున నాఁ డా
శంక మనంబునఁ బొడమెను
బంకజముఖి నీకు భేదభావము గలదే.

106


క.

నిను నేఁ దప్పులు పట్టితి
నని కోపము సేయవలవ దాప్తుఁడ నై నా
మనమునఁ దోఁచిన యర్థము
వినుపించితిఁ గూర్మి చేత విమలేందుముఖీ.

107


ఆ.

అనఁగ లక్ష్మి యిట్టు లనియె నోమునినాథ
నీవు చెప్పినందుచే విరోధ
మడఁగె నిటకు వచ్చినప్పటి నాభావ
మిపుడు విన్నవింతు నెట్టు లనిన.

108


క.

అల పద్మావతి చక్రిని
గలసి మెలంగుచును వేడ్కగా నుండఁగ నా
జలజాక్షునివక్షముపై
నెలమిని నే నిల్చియుందు నెట్లన్న నొగిన్.

109


తే.

తలఁచి హరి నిన్నుఁ గరుణతోఁ బిలువవచ్చు
నపుడు వంచించి వచ్చి నీయాశ్రమంబు
నందుఁ జేరితి ననగ సంయమివరుండు
చిఱునగవు నవ్వి లక్ష్మి నీక్షించి పలికె.

110