పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/444

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

437


సీ.

సిరి నీవు తపములు చేసి యాశ్రీస్వామి
        యురమందు వసియించి యుండి భృగుని
యందు నేరం బిడి యలిగివోవుట నీకుఁ
        దగునె భృగుం డేమి తప్పు చేసె
మూఁడుమూర్తులగుణములు పరీక్షించుట
        కై మును లంపఁగ నజుని జేరి
యతనిరజోగుణం బట పరీక్షించి శం
        కరునితమోగుణం బరసి యంత


తే.

హరిమహాసత్వగుణము బ్రహ్మాదులకును
దెలియఁజేసెడికొఱకుఁ దా నెలమిభక్తి
నుంచికొని తన్నినాఁడు గర్వించి తన్నె
ననుచుఁ బల్కకు మునిభావ మరయకుండ.

91


సీ.

స్వల్పదోషములకు జలజజుండును రుద్రుఁ
        డలిగిన యాదోష మతిశయముగఁ
దాఁ జేసి చక్రి యందఱచేత మెప్పింప
        వలె నంచుఁ దన్నినవాఁడ గాని
కోపంబు మదినుంచుకొని తన్నలేదు గా
        వున వెన్నుఁ డాపని కనుమతించి
యతని గొప్పగ నెంచి యంపించె నాహరి
        యందు నాభృగుమునియందుఁ దప్పు


తే.

లుంచి హరి నెడఁబాసిపోవుటను నీద
తప్పు గొప్పదిగాన నింతటివిరోధ
మీవు చేయంగరాదు శ్రీదేవుఁ డచట
నిలువ కప్పుడ వేంకటాచలము చేరి.

92