పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/438

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

431


తే.

దేవతాస్త్రీలు మోహినీదేవిఁ జూచి
విస్మయానందచిత్తలై విశ్వమునను
జూచితిమె యిట్టి యింతిని సుదతులార
యనుచు లజ్జించి యిట్లనుకొనిరి మఱియు.

65


శా.

ఈకాంతామణి నద్భుతం బెసఁగఁగా నీరాజు పుట్టించినాఁ
డేకాలంబున నైన నిట్టి మహిమం బెం దేని గన్గొంటిమే
లోకాతీతుఁడు గాని యీపురుషుఁ డీలోకంబునన్ నుండువాఁ
డే కాఁడు మనుష్యుఁ డంచు మన మి ట్లీపుర్షుని న్వేడ్కతోన్.

66


వ.

వచ్చి చూచి మోహించుట ధర్మంబుగాదు గావున.

67


సీ.

మఱి కొంద ఱప్పుడు మానినీమణులార
        యీతండు తపసిగ నెంచఁదగదు
శ్రీగురుం డనవలెఁ జెలులార లేకున్న
        యొకయింతి సృజియింప నోపనగునే
చెనకితి మూరక సిగ్గుపా ట్లయ్యె నిం
        కేమియు లేదుపో యిచట మనకు
ననుచుఁ జింతింపఁగ నాపుష్పబాణుండు
        తలఁచె నిమ్మెయి నాదుతండ్రిఁ జూడఁ


తే.

దపము సేయుచు నుండఁగఁ గపటపుష్ప
బాణమును బట్టి యెందుకు వచ్చి తేను
తండ్రి యేమి తలంచునో తపము మాని
యంచు గడుభీతి నొందుచు నరిగె నంత.

68


మ.

దిగులుం బొందుచు నేమి దోఁచ కపు డాదేవాదిదేవు న్మహా
జగదీశుం గని భ క్తి మీఱఁగ నమస్కారంబులం జేసి మె