పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

429


మ.

అని రంభాదిసతీసమూహమును నెయ్యం బొప్పఁ బంపింప న
త్తనుమధ్యల్ మణిభూషణంబులు సువస్త్రంబుల్ విరుల్ దివ్యచం
దనముం దాల్చి యొయారము ల్చెలఁగఁగాఁ దాంబూలముల్ చేయుచుం
జన విష్ణుండు తపం బొనర్చు ఘనసుస్థానంబునం జేరఁగన్.

57


క.

కలకంఠము లళులును జిలు
కలు కలకలరవము సేయఁగా సూనశరుం
డులుకక మలయానిలమును
జెలువలరఁగఁ గూడి యచటిచేడెలచెంతన్.

58


క.

చేరిన మారుని గని యా
నారీమణు లెల్ల మెఱయ నగి యచ్చటిశృం
గారవనములోఁ జొరబడి
కోరిక లుప్పొంగఁ బూలు గోయుచు నెలమిన్.

59


క.

చిలుకలవలెఁ దగిజిలిబిలి
పలుకులు పల్కుచును జెలఁగి పకపక నగుచున్
జెలువారఁగ నొండొరులను
బిలుచుచు నిట్లనిరి చాలప్రేమ యెసంగన్.

60


సీ.

అక్కలారా కొమ్మ లెక్కి పువ్వులు గోసి
        చక్కగ వనమెల్లఁ జల్లరమ్మ
భువిని వసంతమాధవుఁజెంత వనలక్ష్మి
        జేర్చి వివాహంబు చేయరమ్మ
మల్లెపువ్వులఁ గోసి మగువలారా వేడ్క
        దలఁబ్రాలు వోయరె దంపతులకు