పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/433

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

426

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


సీ.

అని భారతీదేవి యశరీరయై పల్కె
        విని వింతగాఁ జక్రి కనులు దెఱచి
నాల్గుదిక్కులు చూచినను దేని కెవరందుఁ
        గన్పట్టకుండఁగ గగనవాణి
చెప్పినమాటలు సిద్ధం బనుచు లేచి
        గరుడవాహన మెక్కి కదలి దారి
దప్పక శేషభూధరము గ్రక్కునఁ జేరి
        వేఱ తా నొకరాజవేష మచట


తే.

గ్రమముగా ధరియించి పుష్కరిణియందు
స్నానసంధ్యాదికృత్యముల్ సల్పుచున్న
గాంచి రారాజవరుఁ డని గౌరవముగ
నెంచి వైఖానసార్యులం దిష్టు లగుచు.

44


తే.

వేగ క్రతుభోక్త యగుమహావిష్ణు దేవు
నతిథి యని పూజ చేసి దివ్యాన్న మపుడు
పొసఁగ నర్పించి విడె మిచ్చి పుణ్యకథలు
చెప్పి దయయుంచు మంచు నాశీర్వదించి.

45


క.

తను వీడ్కొల్పఁగఁ బర్వత
మును డిగ్గి యగస్త్యనామముఖ్యాశ్రమముం
గనుఁగొని దానికి దూర్పుగఁ
జని సిద్ధస్థలమునంద సరగున జేరెన్.

46


వ.

అప్పుడు విష్ణుండు గరుడుని డిగ్గి వాయుదేవుని స్మరింప
నతండు వచ్చి చక్రికిఁ బ్రణమిల్లి యిట్లనియె.

47


క.

దేవా నన్నుఁ దలంచుట
కీవేళం గార్య మేమి యెఱిగింపుము నే