పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/420

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

413


శరాజునకుఁ బ్రత్యుత్తరలిఖిత మంపించుటయు, వకుళ శేషా
ద్రికి వచ్చి హరికి శుభవార్త లెఱింగించుటయు, వివా
హంబున కర్థంబు లేదని వకుళ వరాహస్వామితో జెప్పు
టయు, హరిచేత శుభరేఖ గైకొని గరుడుండు సత్య
లోకంబునకు నరుగుటయు, శౌరిచే శుభపత్త్రిక కొని సని
శేషుండు శంకరుస కిచ్చుటయు, శ్రీనివాసుఁ డింద్రాదులతో
సంభాషించుటయు, సిరిం దలంచి హరి చింతించుటయు,
కొల్లాపురివాసి యైనలక్ష్మిని సూర్యుండు దోడ్కొని వచ్చి
హరిచెంత నిల్పుటయు, సిరితో హరి తనకష్టంబు చెప్పుటయు,
హరితో లక్ష్మి సంభాషించుటయఁ, గులదేవతార్చనంబును,
హరి కుబేరున కప్పుపత్రంబు వ్రాసియిచ్చుటయు, సాయం
కాలవర్ణనంబును, సూర్యోదయవర్ణనంబును, బ్రహ్మాదులతో
శ్రీనివాసుండు వివాహంబునకుఁ దరలివోవుటయు, స్వామి
కాకాశరాజు కన్యాదానంబు చేయుటయు, వివాహానంత
రంబునం జక్రి యగస్త్యాశ్రమంబునకుఁ బోయి బ్రహ్మాదుల
వీడ్కొల్పుటయు, శ్రీలక్ష్మి క్రమ్మఱఁ గొల్లాపురంబున కరుగు
టయు, వసుథాతొండవానులు యుద్ధసన్నద్ధులై యుద్ధము
సేయుటయుఁ, దొండవానునకు హరి విశ్వరూపంబుఁ జూపు
టయు, శ్రీనివాసునకు విశ్వకర్మ దివ్యాలయంబు నిర్మించు
టయుఁ, బద్మావతీసమేతంబుగ హరి శేషాద్రి చేరుటయుఁ ,
గూర్మునిచరిత్రంబుసు, శ్రీనివాసుండు భీమునకు సాయుజ్య
మిచ్చుటయును, దొండవానునకుఁ జక్రి సారూప్య మిచ్చు
టయు ననుకథలం గల పంచమాశ్వాసము.