పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

411


బ్రతిమార్చనంబులు చేసి తర్వాత హరి సర్వాంతర్యామి
యగుటం జేసి రామకృష్ణాదివిభవావతారధ్యానగుణాను
భవంబు చేయుచుండి దాన యనిరుద్ధప్రద్యుమ్నసంకర్షణ
వాసుదేవవ్యూహప్రభావంబు లెఱింగి ధ్యానించి తన్నామ
జపంబులు చేసి పరమగతిం బొందుట కర్చారూపంబులు
హేతువు లగు నందు సకలజనసంరక్షణంబు సేయుకొఱకు
శ్రీనివాసుండు స్వయంవ్యక్తార్చావిగ్రహుం డయ్యెనని చెప్పి
సూతుండు వెండియు నిట్లనియె.

363


క.

శృంగారాంగునకుం జయ
మంగళ మహిరాజశైలమందరునకు శ్రీ
మంగాపతి కతిశయశుభ
మంగళ మొనఁగూడవలయు మహియం దెపుడున్.

364


క.

అని సూతుఁడు వచియింపఁగ
విని శౌనకముఖ్యమునులు వేంకటపతినేఁ
గొనియాడుచు సూతునితో
ననువొందఁగ గోష్టి నుండి రచ్చట వేడ్కన్.

365


క.

భావజజనక శుభాకర
భావజరిపుమిత్ర భూతభావనవిలస
ద్భావాతీతజగన్మయ
శ్రీవేంకటగిరినివేశ చిదచిదధీశా.

366


తురంగవృత్తము.

వికటసురరిపుహరణ గురుతరవిశ్వరక్షణకారణా
సకలమునిజనహృదయకమలవిచారణాఘనివారణా