పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

408

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


యన హరిఁ జూచి నవ్వి నృపుఁ డర్థిని మోక్షమ నా కొసంగవే
యని శరణాగతుం డగుచు నంచున రాఁ గని చక్రి నవ్వుచున్.

352


సీ.

కరుణారసము సృపాగ్రణిమీఁద నిండించు
        చుండఁగ గగనమందుండి దివ్య
పుష్పకం బచటి కద్భుతముగ వచ్చె న
        ప్పుడు తొండవాను నాపుష్పకంబు
నందుంచి సారూప్య మతనికిఁ దా నిచ్చి
        వైకుంఠపురికిని వఱల నంపి
తననివాసము చేరెఁ దదనంతరమున నా
        చక్రవర్తిసుతుండు సాంగముగను


తే.

వేగ తండ్రికిఁ బరలోకవిధు లొనర్చి
శ్రీనివాసుని పాదరాజీవయుగళ
మందు భూభాగ ముంచుచు నచలుఁ డగుచుఁ
దాను వసుథానుఁడును రమాధవుని కచట.

353


సీ.

ప్రథితనిత్యోత్సవపక్షోత్సవములు మా
        సోత్సవసంవత్సరోత్సవములు
నడిపించుచుండగ నారాయణుఁడు శిలా
        విగ్రహుఁ డై మహావిభవములను
సొంపుగ నంగీకరింపుచు వసుథాను
        నాశ్రీనివాసుండు నాదరమునం
బాలన సేయుచు భక్తి భావించుచు
        సకలకార్యములను స్వప్నములను


తే.

దాన చెప్పుచు మౌనముద్రను ధరించి
కుదిరి పద్మావతిని గృపఁ గూడి వివిధ