పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

404

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


తే.

అనఘ యిచటికిఁ గ్రోశద్వయార్ధదూర
మం దొకఁడు కుర్వకగ్రామమందఁ గలఁడు
ధరఁ గులాలుడు భీమాభిదాసుఁ డధిక
భక్తుఁ డొగిఁ బేదవాఁ డందుఁ బ్రతిదినమున.

334


ఉ.

కుండలు చేసిచేసి యొకగూటను బెట్టుచు నప్పుడప్పుడున్
రెండుకరంబులం బులిమి రేగినమట్టిని చిత్రపుష్పముల్
దండిగఁ జేసి నావలనె చారుకరూపము నేర్పరించి తా
నిండినభక్తి మీఱఁగను నిత్యము నర్చనఁ జేయుచుండఁగన్.

335


సీ.

ఆపుష్పములను నే నంగీకరింతు ని
        ట్లనుదినం బని వల్కె నపుడు నృపతి
వెఱగు నొందుచు హరి వేవేగ పూజించి
        బిలము వెల్వడిపోయి భీముచెంతఁ
జేరిన రాజు నీక్షించి కులాలుఁ డి
        ట్లనె మహారాజ నీ వద్భుతముగ
శూద్రగృహమునకుఁ జొచ్చి వచ్చుట కేమి
        పని యానతిం డన జనవిభుండు


తే.

పల్కె నిట్లని భీమ నీభక్తి శేష
శైలపతి మెచ్చినాఁడు నిశ్చయముగాను
నీవు చేసిన సద్భక్తి భావరీతిఁ
దేటగా నా కిపుడు నీవు దెల్పు మనఘ.

336


చ.

అనినఁ గులాలుఁ డిట్లనియె నయ్య నృపాలక శూద్రజాతివాఁ
డను బహునీచకర్ముఁడ జడత్వమనస్కుఁడ నేను విష్ణుభా
వనఁ గని నీకుఁ జెప్పఁగలవాఁడనె భూపవరేణ్య యంచు న
య్యనఘుఁడు పల్కుచున్నతఱి నంబరమార్గమునందు ధీరుఁడై.

337