పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/410

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

403


తే.

దాసుఁడై నిత్యమును హోమభాసురాబ్జ
ములను గొంపోయి బిలమునఁ జెలఁగి హరిప
దారవిందంబులకుఁ బూజ భూరిభక్తి
చిత్తమున నిడికొని యొగిఁ జేసె నపుడు.

330


ఆ.

అవల మఱల పోవునపుడు కుమ్మరవాఁడు
మంటిపూలుఁ దులసి నింటఁ దీర్చి
దారుమూర్తియందుఁ దా సమర్పింపగ
నట్టిమంటిపూలు హరిని చేరె.

331


క.

వనజాక్షుం డాసుమములఁ
దనయందే డాఁచుచుండు ధరణీంద్రునకున్
గనఁబడనీక కులాలుని
తనమదిలో మెచ్చుచుండుఁ దద్దయుఁ బ్రేమన్.

332


సీ.

రాజుచేసినపూజ రాజసం బని మెచ్చ
        గుండి మృత్కుసుమంబు లొక్కనాఁడు
భూనాయకుఁడు తన్ను పూజ చేసెడువేళఁ
        జూపె నాఁ డామృత్ప్రసూనములును
గాంచి నేనితని బంగరుపూలఁ బూజింతు
        నీమట్టిపూపు లిం దెవ్వఁ డుంచె
సని సంశయించుచు నబ్జాక్షునకు మ్రొక్కి
        పలికె నిట్లనుచు నోపరమపురుష


తే.

నే సమర్పించుసుమముల నేలఁ ద్రోసి
మట్టిపూ లిందుఁ బెట్టిన మనుజుఁ డెవఁడు?
దెల్పు మని నృపుఁ డడుగ నద్దేవుఁ డపుడు
నృపుని కిమ్మెయి ననియెను నీతి యెసఁగ.

333