పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/409

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

402

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


యౌవనకౌమారవార్ధకదశల ననుభవించి కాలపరిపాకంబున
మృతినొంది క్రమ్మఱం బుట్టినవారలు లోకాంతరంబులం
దనుభవించిన కష్టసుఖంబుల మఱలం జెప్ప మఱచివోదు
రటు గావున నీమువ్వురు కాలపరిపాకంబు గాకయ యన్నంబు
లేకయ నశించిన స్థూలదేహంబులం దుండక సూక్ష్మదేహం
బుల నవలంబించికొని లోకాంతరంబులం జరించి హరికటా
క్షంబువలన నప్పుణ్యతీర్థంబునం బ్రవేశించి పరిపూర్తినొందిన
పూర్వస్థూలదేహంబులంద మఱలం జేరినందున వారి
కాలోకాంతరవ్యాపారంబును హృదయంబులం దుండి నిద్ర
జెంది కలలం గని మేల్కాంచి పరుల కాకలలు చెప్పిన
చందంబున వారాకూర్మునకుం దమవిహారంబులు చెప్పి రిది
యంతయు విష్ణుమాయ యని యెఱుంగవలయు. నీయితి
హాసంబు విన్నవారి పాపంబు నశించి ధన్యు లగుదురని
చెప్పిన విని శౌనకాదులు సూక్ష్మజ్ఞానదృష్టిచేత జీవతత్వాను
భవప్రకారంబు తెలిసి సూతుం జూచి వెండియు నిట్లనిరి.

329


సీ.

నీవు చెప్పిన సూక్ష్మనిర్మలభావంబు
        తెలిసెనో సూత సందియము తీరె
నది యటులుండని మ్మాకూర్ముఁ డరిగిన
        వెనుక నృపాలుండు వేంకటాద్రి
పతి నెవ్విధంబున భక్తుఁడై పూజించె
        నారీతిఁ జెప్పు మిం కనిన మునులఁ
గని సూతుఁ డిట్లనె జననాయకుఁడు భూమి
        నేలుచు శ్రీవేంకటేశ్వరునకు