పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

396

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


క.

అని బ్రహ్మ పల్కుపల్కులు
విని ముదమును బొంది యాదివిష్ణుం డిచటన్
వసజజ నాకు రథోత్సవ
మనువొందఁగఁజేయు మఱల నన నజుఁ డంతన్.

310


వ.

అం దాఢ్యుండై యున్న తొండవానుం డనుచక్రవర్తిచేత
వైఖానసాగమోక్తంబుగ నుత్సవప్రయత్నంబు సేయించి
పూర్వప్రకారంబుగఁ గన్యామాసంబునం దంకురార్పణం
బును ధ్వజారోహణంబును వివిధవాహనరథోత్సవతీర్థవారి
ప్రముఖకృత్యంబు లాచరింపఁజేసి బహుభక్ష్యభోజ్యంబులు
నైవేద్యంబులు సమర్పించి సర్వంబు శ్రీనివాసార్పితంబు
గావించి మ్రొక్కి తదాజ్ఞానుసారంబుగ నింద్రాదులు నిజ
నివాసంబుల కరిగిరి. అంతఁ దొండవానుండు హరికి సకలోత్స
వంబులు నడపి నిజరాజ్యపరిపాలనంబు సేయుచుండి నం
దొక్కనాఁడు.

311


సీ.

శ్రీకరమతిని వసిష్ఠగోత్రుఁడు కూర్ముఁ
        డను బ్రాహణోత్తముఁ డటకు వచ్చి
తొండవానుని జేరి తొలుత గార్యార్థియై
        యాశీర్వదించి యిట్లనియె 'రాజ
విను భార్యతో జాన్హవీయాత్ర వోవఁగ
        భార్యకు గర్భంబు ప్రాప్త మయ్యెఁ
బంచాబ్దములవాఁడు బాలుండు తల్లిని
        వీడి నావెంట రాలేఁడు గనుక


తే.

ధర్మసంకటమైన దిత్తఱిని సతిని
సుతుని నిందుంచి వోయెద సుస్థిరముగ