పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

394

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


దిరమై యుండఁగ నేను గింకరుఁడనై దేవా! సభక్తిన్ భవ
ద్వరపాదంబులఁ బూజసేసెద మునివ్రాతా కృసాంభోనిధీ.

302


వ.

అని తొండవానుండు వేఁడుటం జేసి.

303


క.

ఘనవైఖానసవంశం
బున నుద్భవుఁడైన విప్రముఖ్యునితోడన్
వనజాక్షుఁడు శుకకుంభజు
లను దోడ్కొని వేంకటాచలముమార్గమునన్.

304


క.

వచ్చుట కుద్యుక్తుం డగు
టచ్చట వసుధానుఁ డెఱిఁగి యబ్జాక్షునకున్
మెచ్చుగఁ బద్మావతి కం
దిచ్చెదనని భూషణములు హేమాంబరముల్.

305


తే.

తెచ్చి వారల కర్పించి దీనవదనుఁ
డగుచు నుండఁగఁ జూచి యిట్లనియెఁ జక్రి
చింత నీకేల వసుథాన శేషగిరిని
నిలచియుండెద మని పల్కి నెమ్మి మీఱ.

306


ఆ.

మఱల నిట్టు లనియె మచ్చిక నార్యుల
నాదరింపుచుండు మబ్జవతిని
జూచుకొఱకు దందశూకాద్రి కెపుడైన
వచ్చు వోవుచుండు వసుధ నేలు.

307


వ.

అని యిష్టంబు చెప్పి సంతసింపఁజేసి వాని వీడ్కొని పద్మావతీ
సమేతుండై తొండవానుని దోడ్కొని మంగళవాద్యములు
మొఱయ వికృతినామసంవత్సరంబునఁ బాడ్యమితిథియు
నశ్వినీనక్షత్రంబును గురువాసరంబును గూడిన శుభదినంబున
సాయంసమయమునకు వేంకటాద్రిఁ జేరి వైఖానస బ్రాహ్మ