పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/400

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

393


చ.

అని హరి యానతిచ్చిన మహాద్భుతమంది ధరాధినాథుఁ డి
ట్లనియె మహాసుభావ సకలాత్ముల కాత్మవు నీవు గాన నా
జనసము పూర్వజన్మగతి సర్వము చెప్పితి వాదిదేవ నే
మనుజుఁడఁ గాన నీత్రిగుణమాయ నెఱుంగుదునే పరాత్పరా.

299


క.

అని బహువిధములుగా నిటు
వినుతులు గావించి హరిని వీడ్కొని యపు డా
జనపతి సంతోషించుచు
ఘనభక్తి చెలంగ విశ్వకర్మను గొనుచున్.

300


వ.

వేంకటాద్రిఁ జేరి తామున్నుద్రవ్వినబావిని బాగుచేయించి
స్వామివారికి దేవాలయంబు నిర్మింపు మనిన విని యావిశ్వ
కర్మ విధిచొప్పు దప్పక ప్రాకారత్రయంబును గోపురద్వయం
బును సప్తద్వారంబులును, స్వామి నిజాస్థానమంటపంబును,
గోశాలయును, ధాన్యశాలయును, వస్త్రభూషణాగారంబును,
శయ్యాగృహంబును, వైవాహికమండపంబును, తైల
ఘృతాలయంబును, అన్నశాలయుసు, భూతీర్థకూపంబును,
నిర్మించి యన్నిటకు మధ్యప్రదేశంబునం దాళవృక్ష
ప్రమాణోన్నతవిమానంబు రచించి తదుపరి శాతకుంభంబు
నుంచి విశాలవీథిత్రయంబు గావించి వేంకటాద్రికి భక్తవరులు
వచ్చుటకు యోజనమార్గసోపానంబులును, నడుమ నడుమ
మండపంబులును, నీరాగారంబులును, నిర్మించి సకలపదార్థా
కర్షణంబు సేయించి యాయాగృహంబులయం దుంచి గిరి డిగ్గి
హరిచెంతఁ జేరి మ్రొక్కి యిట్లనియె.

301


మ.

హరి మీసత్కృపచేత వేంకటగిరీంద్రాగ్రంబున న్మీకు మం
దిరముం జెల్వుగనైనదం దొగి సదా దేవి బ్రియం బారఁగాఁ