పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

392

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


గర్వించి చెడితివి గావున నిందుండ
        కరిగి యధోలోకమందుఁ బుట్టు
మని శాసింపఁగను వాఁ డడరి శోకింపఁగ
        నే జాలినొంది మన్నించి పిలిచి


తే.

దోషభోగ్యుఁడనే నీవు దుఃఖపడక
రంగదాసరి నీమనోరాగ మింత
చేసే బ్రాహ్మణశాపంబు సిద్ధముగను
నే నివారింప లేనట్లు గాన నిపుడు.

296


తే.

పుష్కరిణిలోన మునిఁగి యీబొంది విడువు
మటను ధర్మమహీపతియందుఁ జేరి
నాగకన్యకగర్భంబున జనించి
ధారుణిం దొండవానాఖ్యఁ దనరి యవల.

297


సీ.

వసుధ నేలుచును నావాఁడ వయ్యెదవు సి
        ద్ధముగ నాసేవ వ్యర్థంబుగాదు
చింతింప కిపుడు నేఁ జెప్పినపని సేయు
        మన రంగదాసుఁ డం దట్లజేసె
నతఁడు నీవై పుట్టి హితము రెట్టింప నా
        భక్తుఁడ వైతివి పార్థివేంద్ర
పూర్వజన్మమున నేర్పుగ నీవు ద్రవ్విన
        బావి యిందున్నది భద్రముగను


తే.

జక్కఁజేయింపు మిఁక నది శాశ్వతముగ
నుండు నేఁ దాల్చి విడుచుచునుండు పుష్ప
ముల ధరించుట కది ధర ముఖ్యముగను
జారుశుభమూర్తి తొండవాన్ చక్రవర్తి.

298