పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

391


ఉ.

అచ్చటఁ గృష్ణలీలల నొయారముగం బ్రకటింతు నీకు నే
నెచ్చుగ వింతవింతలుగ నేడ్తెఱ నావల నీకులస్థులే
వచ్చి సభక్తి నర్చనలు వారక చేయుచు నుందురంచు నే
నిచ్చితి సద్వరంబని యదృశ్యుఁడ నైతిని ధాత్రినాయకా.

293


సీ.

వరవిప్రుఁ డందుండి వచ్చుచుండఁగ రంగ
        దాసాభిధానుఁడు దారియందు
జతగూడఁగా శేషశైల మాయిర్వురు
        చేరి న న్నచట వీక్షించి మ్రొక్కి
యారంగదాసుఁడే యచ్చట నొకబావి
        ద్రొవ్వి గట్టునఁ బూలతోట వేసి
తాన శ్రీతులసిసద్దళసుమంబు లొసంగ
        భూసురుం డవి గొని పూజసేయు


తే.

నావిధంబుగఁ గొన్నియేం డ్లరిగె నవల
సకలజనమోహసం బౌ వసంతఋతువు
వచ్చె నాదాసుఁ డడవిలో వరసుమములఁ
బుట్టలో నుంచుకొని వచ్చి పుష్కరిణిని.

294


తే.

జలకమాడెడు గంధర్వసతులఁ జూచె
నపుడు చిత్తంబు గఱఁగి వీర్యంబు జారి
నందు కపవిత్రగాత్రుఁడనైతి ననుచుఁ
బుష్కరిణిలోనఁ గ్రుంకి తెప్పునను బోయి.

295


సీ.

కుసుమముల్ క్రమ్మఱఁ గోసి తెచ్చిన నందుఁ
        గోపినాథుఁడు చూచి కోపగించి
స్వామిని పూజించుసమయంబునకుఁ బూలు
        తులసి దేనైతివి దుష్టచిత్త