పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

388

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


ప్రభుండై మహాకుక్షి యంభోధిబృందంబునై నాఁడులెల్లన్
బ్రవాహంబులై రోమముల్ వృక్షజాలంబులై శల్యముల్
సర్వశైలంబులై కేశపాశంబులున్ మేఘజాలంబులై ప్రాణము
ల్గంధవాహుండునై బాహు లింద్రాదులై దివ్యగుహ్యేంద్రి
యంబుం బ్రజానాథుఁడై దృష్టి సద్వీర్యమై సుస్తనం బెన్నఁగా
ధర్మమార్గంబునై వెన్ను ధర్మంబునై సారవాగింద్రియం
బగ్నియై దంష్ట్రలు దండహస్తుండునై మించె నిత్యాది
చిత్రంబు లీవేళ నీయందుఁ గన్పింపఁగా మిక్కిలిన్ వేయు
శీర్షంబులన్ వేయునేత్రంబులన్ వేయుహస్తంబులన్ వేయు
పాదంబులన్ గోటికోట్యర్కసంకాశపూర్ణ ప్రకాశంబుచే
నొప్పు నీనిశ్వరూపంబు నేఁ జూడ శక్తుండనే దేవ పూర్వస్థితి
న్నీమహాసౌమ్యరూపంబునే చూపి రక్షింపు మీశా చిదా
కాశ శేషాచలేంద్రా తరీకుండ సత్పట్టణాధీశ్వరా నారసింహ
ప్రభూ శ్రీనివాసా నమస్తే నమస్తే నమస్తే నమః.282
వ. అని యనేకవిధంబుల వినుతించిన నాహరి సంతసించి తననిశ్వ
రూపంబు మాని యెప్పటియట్ల నుండి తొండవానుని జూచి
యిట్లనియె.

283


క.

మామా నేను వినోదము
గా మనుజుఁడ నగుచు వేడ్కగా మీకన్యం
బ్రేమమునఁ బెండ్లియాడితి
నీమీఁద గృహస్థధర్మ మేను వహింతున్.

284


క.

అమరఁగ వేంకటశైలా
గ్రమునందు నయంబు మెఱయఁగాఁ గనకమయం