పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

387


సీ.

అని యగస్త్యాశ్రమంబునకు వేగమ వచ్చి
        శేషాద్రిపతి మర్మవేష మమరఁ
దెలియనడ్గి మఱందు నిలువక హరిచెంతఁ
        జేరి ప్రాకటభక్తి చిత్తమందుఁ
దనరంగ నప్పుడు దండప్రణామంబు
        లం జేయ నక్కమలాక్షుఁ డెలమి
చూచి యిట్లనె నృపా యీచందమున నాకు
        మామవై మ్రొక్కుట యేమిధర్మ


తే.

మనఁగ నాతొండవానుండు ఘనత మెఱయఁ
గాంచి యోమాధవా మాయనుంచి నన్ను
వెఱ్ఱివానినిగాఁ జేయ వేడ్క నీకు
నహహ యిళ నిన్నుఁ బాయక యాత్మయందు.

280


వ.

ధ్యానించుచుండెద నెంతయుం గృతార్థుండ నైతి నని యనేక
విధంబులఁ బ్రార్థింప నాచక్రి విశ్వరూపంబుఁ జూపుటం జేసి
తొండవానుండు వెండియు నిట్లు నుతించె.

281


దండకము.

శ్రీమద్రమాధీశ జీమూతసంకాశ కాలత్రయాతీత
కంజాతసంజాత తాతా జగత్త్రాత వేదార్థనిర్ణేత భూతాత్మ
సీతాధిపా సద్గుణవ్రాత పూతావనీజాతనాథా శచీనాథ
దాతా మహాఘోర దైత్యాద్రిదంభోళిధారాసహస్రార
సంచార భర్మాద్రిధీరా సదాసింధుగంభీర మంథాచలోద్ధార
నారాయణానంత నీపాదముల్ చూడ పాతాళమై శీర్ష
భాగంబు నీక్షింపఁగా సత్యలోకంబునై మధ్యదేహాంగము
ల్మధ్యలోకంబులై నేత్రముల్ సూర్యశీతాంశులై శ్రోత్రము
ల్టిక్కులై నాసికాంగంబు నాసత్యయుగ్మంబునై జిహ్వ నీర