పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

383


తే.

భండనము చేయఁ జతురంగబలములందుఁ
గొలువఁగా బావమఱఁదిని గూడి సమర
భేరి వేయించె నప్పు డాభూరిరవము
తొండవానుండు విని మహోద్దండుఁ డగుచు.

266


క.

శరచాపంబులు గైకొని
సరవిగ ధైర్యంబు గదుర సంగరమునకున్
హరికిని వసుథానునకును
సరగున నెదురేగి నిలిచె సంరంభముతోన్.

267


వ.

అప్పుడు హరియును వసుథానుండును గనకరథంబు లెక్కి
వీర్యవీరులై నిల్చియుండుటం జూచి తొండవానుండు తన
రథముపై నుండి నిజచతురంగబలంబులం బరబలంబుపైఁ
బురికొల్పి నప్పు డుభయబలంబు లుప్పొంగి రథంబులుమీఁద
రథంబులును గజంబులమీఁద గజంబులును ఘోటకం
బులుమీఁద ఘోటకంబులును గాల్బలంబులపైఁ గాల్బ
లంబును బడి యొండొరులు కరవాలంబుల ఝళింపుచు
నఱకుచు నుఱుకుచు ధనుష్టంకారంబు చేసి బాణంబులం
బ్రయోగించుచు డాయుచుం గుదియుచు నఱచుచు బాహా
స్ఫాలనంబు చేసి ప్రతాపంబులు వల్కుచుం గుంతలంబులన్
గ్రుచ్చుచు ముద్గరంబుల నొడిసిపట్టి ద్రిప్పుచుం బొడుచుచు
శూలంబుల నాటించుచుం బూర్వపశ్చిమసముద్రంబులు
దారసిల్లినభంగి సోరుచుండిరి తొండవానునిబలంబు లరిబలం
బునంబడి పోరాడంజాలక యులుకుచున్నంజూచి నిలునిలువో
తగదని సిలచి వసుథానుండు తనరథంబు దోలించి చండకాం
డంబులం బ్రయోగింప నది యోపంజాలక తొండవానుం