పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

382

శ్రీవేంకటాచల మాహాత్మ్యము


సీ.

వసుదేవసుత నేను వసుథానుఁ డీక్షితి
        కొఱ కింక ఘోరాజి మెఱయఁ జేయ
వలయుఁ దోడ్పడు రమ్ము చెలఁగి నీ వన నవ్వి
        తన మది నిటు దాసు దలఁచె శౌరి
తొండవానుని కేను దోడుగఁ బోయితి
        నైనఁ బద్మావతి కలుక పుట్టు
తనతమ్ముఁ డగు వసుథానునిప్రక్క నే
        నుండిన సతి చాల నుత్సహించు


తే.

తొండవానుండు పరమభక్తుండు నాకుఁ
బరఁగ వసుథానునిం గన బావమఱఁది
గనుక యిర్వురితోను సఖ్యంబు వొసఁగఁ
జేయవలె దీని కిఁక నేమి సేయు దకట.

264


మ.

అని యోచింపుచుఁ దొండవాను నపు డయ్యబ్జాక్షుఁ డీక్షించి యి
ట్లనె నోమామ మహాజి దిపుడు తోడై నేను నీదిక్కు వ
చ్చిన పద్మావతి తోడఁబుట్టుకొఱకై చింతించుచుండు న్మదిన్
నిను వీడం దగ దెట్టులైన జయ మే నీతట్టుగా నుంచెదన్.

265


సీ.

అని రహస్యంబుగ నతని కాప్తతఁ జెప్పి
        సమ్ముదంబునఁ దనచక్ర మిచ్చి
పంపించె నటుమీఁద బావమఱఁది వచ్చి
        తనకుఁ దో డడుగఁగ విని రయమున
లేచి యావకుళమాలికకుఁ బద్మావతి
        నం దొప్పగించి నెయ్యంబు మెఱయ
బావమఱఁదితోడఁ బైనమై నారాయ
        ణాఖ్యపురంబున కరిగి యచట