పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

374

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


బాలింపవలయు మాపద్మావతీదేవి
        నిచ్చితి గనుక మీ రింకమీఁదఁ
జిరకృప నీటముంచినఁ బాలముంచిన
        భారంబు మీదంచు బాష్పములను


తే.

గన్నులను నించి మఱువల్కకున్న చక్రి
భూవరుని జూచి వల్కె గంభీరముగను
మామ మీకూఁతునకుఁ జింత యేమి వలదు
రక్షణము సేయ నే కమలాక్షినయ్య.

230


తే.

పెద్ద లైతిరి మీరు సంప్రీతి నెపుడు
చూడుఁ డొప్పుగ మాయందు సుభగయుతుఁడ
యనుచు నుండఁగ నొకగంభ మొనరఁబట్టు
కొని ప్రియోక్తుల నత్త యిట్లనియె నపుడు.

231


తే.

అయ్య మాపద్మ నేలుము నెయ్యమార
దాని కొకకష్ట మెఱుఁగదు దైత్యనాశ
బాల సుకుమారి లక్ష్మితోఁ బరఁగువాఁడ
వగుట పెక్కులు చెప్పంగ నగునె నాకు.

232


వ.

అంత రమాదేవికిని వకుళమాలికకును జెప్పఁదగిన వచనంబులు
చెప్పె నంత నాహరి ప్రయాణంబై యున్నయెడ నారాజేం
ద్రుఁడు శాలితండులంబు లిన్నూఱులక్షల భారువులును,
ముద్గధాన్యంబు ముప్పదిభారువులుసు, తింత్రిణీఫలేక్షుఫలం
బులు నలువదివేలభారువులును, సహస్రక్షీరభాండంబులును,
శతశర్కరమధుఘటంబులును, కదళీకూష్మాండకందమూలాది
శాకనిచయంబును, హింగుళీయాదిపాకపదార్థంబులును,
హయగజవృషభంబులపై నిడి శ్రీనివాసార్పితంబుగ దత్తంబు