పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

361


గా నాగేంద్రుఁడు చక్రపాణికిని సత్కల్యాణముం బాడుచున్.

194


శా.

ముత్తైదుల్ చనుచుండఁగా ద్విజవరుల్ మోదాన వేదంబు లె
ల్గె త్తెంతో వచియింపఁగా నెలమిమై నింద్రాణి దేవాంగనల్
ముత్తెంబు ల్విరులన్ శుభాకరకరంబు ల్పట్టి యాచక్రికిం
జిత్తంబుల్ ముదముంద సేస లొగి శ్వశ్రేయంబుగన్ శీర్షమున్.

195


వ.

చల్లి రంత.

196


ఆ.

హేమరథముమీఁద నిందిర పుష్పర
థంబుమీఁద వకుళ తార్క్ష్యవాహ
నంబుమీఁదఁ జక్రి నందిపై రుద్రుండు
హంసవాహనంబునందు బ్రహ్మ.

197


సీ.

ఎక్కిరి పురుహూతుఁ డిభమునం దగరుపై
        ననలుండు మహిషంబునందు యముఁడు
నరునిపై నిఋరుతి వరమకరంబుస
        వరుణుండు మృగమునఁ బవనుఁ డెలమి
హయముపై ధనదుండు నవలతక్కినవారు
        తమవాహనంబులం బ్రమదమారఁ
గూర్చుండి తమతమగూర్మిపత్నులతోడ
        హరికి ముందఱ ధాత నరుగ వెన్క
రుద్రుండు కుడిదట్టు రూఢిగ శ్రీసతి
        యెడమదిక్కున వెన్క నెలమి గుహుఁడు


తే.

వివిధవాద్యంబు లెంతయు వీనులలరు
చుండ మ్రోయంగ నరదంబు లోలిరాఁగ