పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

352

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


పదార్థంబులును దెప్పించె, నంత నాహరి పావకునిం జూచి
భక్ష్యభోజ్యాన్నాదు లింతకుఁ జేయకుండు టేల యని
యడుగ నతం డిట్లనియె.

162


క.

పాత్రుఁడ వన్నింటికి నీ
క్షేత్రంబునఁ బాక మలరఁజేయుటకును మృ
త్పాత్రంబు లైనలక్ష్మిక
ళత్రా లేవనఁగ లేక లలియుందు నిటన్.

163


వ.

అనిన విని షణ్ముఖునిం బిలిచి యడుగ నతం డూరకయుండుటం
జేసి బ్రహ్మాదులు వినుచుండ నగుచు నారాయణుం డిట్లనియె.

164


సీ.

పరదేశి పెండ్లికిఁ బాత్ర లెందుండును
        నమరు పుష్కరిణి దివ్యాన్నపాత్ర
పరిశోభితం బైన పాపవినాశమ
        శుద్ధోదకానికి శుద్ధపాత్ర
ఆకాశగంగయ యన్నపుపాత్ర గో
        గర్భంబ పరమాన్నకంబుపాత్ర
గురుతరంబైన తుంబురుకోన చిత్రాన్న
        పాత్ర శాకముల నేర్పఱచి సేయు


తే.

భక్ష్యముల నిడు శ్రీపరబ్రహ్మతీర్థ
పాత్ర మఱి పచ్చడులకును బాండుతీర్థ
పాత్ర ముపదంశములకు సత్పాత్ర మాకు
మారధారయ యనుచు రమావిభుండు.

165


వ.

వినోదంబుగఁ బల్కుటం జేసి యష్టవసువులు విని చిన్నవోయి
లజ్జించి సత్వరంబున నక్షయపాత్రలు చెప్పించి యొసంగుటం
జేసి వైశ్వానరుండు సంతసంబు మృష్టాన్నం బొనరించి భోజ