పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

351


సీ.

శ్రీకరలీల స్వస్తీశ్రీ జయాభ్యుద
        యాష్టాదశద్వాపరాంతమందుఁ
గల కలి నాదివేంకటనాయకుఁడు ధన
        పతి కొసంగిన వడ్డిపత్ర మెట్ల
యనిన నావైవాహనమునకు నీచే నప్పు
        గొనిన టెంకీలును గోటిసంఖ్య
లలిని జతుర్దశలక్ష లందుకు వడ్డి
        ప్రతివత్సరంబును బరఁగ నిత్తు


తే.

కలియుగాంతమునండునఁ గాసువీస
ముంచ కొగిఁ దీర్చివేయుదు మొనసి దీని
కజుఁడు శంభుఁడు మఱియు హిమాంశుఁ డినుఁడు
సాక్షులు నిజంబు వృక్షరాజంబు సాక్షి.

160


తే.

ఇట్లు నాయిష్టమున వ్రాసి యిచ్చినట్టి
స్వకరలిఖితం బటంచును ననజభవుఁడు
చదివి వినిపించి పార్వతీశ్వరునిచేత
నిచ్చి చూడు మటంచును మెచ్చఁ జెప్పి.

161


వ.

ఇచ్చుటం జేసి యది చూచి యిందుకు నొకసందియం బుండదు
సఖుఁడా యని ధనదుని మెఱమెచ్చఁ బల్కి యొసంగె నప్పు డా
ధనేశ్వరుండు పత్రంబు చేకొని హరికి రయంబున యక్షులచే
స్వర్ణరామటెంకీలు కోటిని దెప్పించి యెంచి యొసంగుటం జేసి
పుచ్చుకొని క్రమ్మల నాధనం బాయక్షేశుని కడ నుంచి
పలసిన పదార్థంబులు చెప్పింపు మని చెప్పె. నాధనేశుం
డవ్వివాహంబునకు వలసిన మంగళద్రవ్యంబులును, వస్త్రభూ
షణాంబరంబులును, భోజనపదార్థంబులును, మఱి యితర