పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

350

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


శంభుడును ధాతయునుగూడి సాక్ష్యములను
వేసియిత్తురు ననఁగ భావించి యతఁడు.

155


సీ.

వలికె నిట్లనుచు నోపద్మాక్ష నీకృప
        నిపుడుండు ధనము నే నెంతయైన
నిచ్చెద వడ్డియు నేటికీ వైవాహ
        మైనచోఁ జాలు మా కందఱకును
బరమసంతోషంబు భావింప నింతక
        న్నను లాభ మొక్కండు గనుటఁగలనె?
యనఁగ నాహరి యిట్టులనియె దానం బేను
        గొనుటకుఁ దగదు నీ కనువుగాను


తే.

వడ్డిపత్రంబు నొకయాకుపసరుచేత
మ్రానిపట్టను దగఁ దాను బూని వ్రాసి
యజుని శంభుని సాక్ష్యంబు లలర నిడఁగఁ
జేసి యిచ్చెను విత్తంబు చెంతలేక.

156


వ.

అంత శంభుని యజుని వీక్షించి హరి యిట్లనియె.

157


చ.

అజహరులార! యీకలియుగాంతము వచ్చెడుదాక ధన్యమౌ
భుజగగిరీంద్రమందుఁ బరిపూర్ణవిలాసము లద్భుతంబుగా
సుజనుల కెల్ల మెచ్చువడఁ జూపి వరంబు లొసంగి విత్తమున్
నిజముగ సంగ్రహించి యట నేను గుబేరున కప్పుదీర్చెదన్.

158


తే.

మీరు సాకిరు లని వల్కి భూరి ముదముఁ
దాను వ్రాసినయట్టిపత్రంబు నజుని
చదువుమన నబ్జభవుఁ డంత సరవి దాని
చదివె నీరీతి ధనదుఁ డీశ్వరుఁడు వినఁగ.

159