పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

339


యది యటులుండని మ్మాకాశనృపకన్య
        నన్ను మోహించెను సన్నుతించి


తే.

గాన దానిని నేఁ బెండ్లి కరము ప్రీతి
నాడ నెంచితి నీ వాడమంటివేని
పెండ్లియాడెద లేకున్నఁ బెండ్లి వలదు
తొంటిసంగతి మది నెంచు తోయజాక్షి.

121


మ.

అని పద్మాక్షుఁడు వల్కఁగా మనమునం దాశ్చర్యముం బొందుచున్
వనజాతాలయ పల్కె. నట్లు మఱి యవ్వామాక్షి మోహించి తా
నినుఁగాఁ బిల్చెనొ దాని నీ విపుడు మన్నింపం బ్రయత్నంబు లిం
దొనరం జేయుటఁ జూచితి మనసునం దుప్పొంగితిం గేశవా.

122


సీ.

కమలాక్ష మంగళకరముగఁ బసపుజా
        బింపుగఁ దొల్తఁ బంపించ కీవు
మొగి నసక్తుఁడ నని మోము చూచుటకు ర
        మ్మని నన్నుఁ బిలిపించినందునలన
భీతిల్లి వచ్చితి ఖ్యాతిగ నేవచ్చు
        రీతి రానైతి సంప్రీతి మెఱయ
నేఁ దొల్త వచ్చిన నీ పెండ్లి కిపు డొప్ప
        నని సంశయించితి వందుచేత


తే.

నింతపని చేసితివి మంచి దీవివాహ
కారణముచేత నైన నిక్కడకు నన్ను
నేఁడు పిలిపించినందున నీముఖంబు
గంటి నా కింతయేచాలుఁ గమలనాభ.

123