పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

335


నిది యేమి చోద్య మీయిందిరేశుని కని
        శివుఁ డాహరినిఁ జూచి చెప్పె నిట్లు
శుభకాలమున నీవు శోకింపఁగా రాదు
        మఱియు లౌకికహాని మాను మదియు
ప్రేమతోఁ దొల్తన పిలిపించుటను మాని
        యభ్యంగనస్నాన మంచు నిట్లు


తే.

సేయఁగా రాదు నీవ యీచింత నుండ
నెవరు నీ కెదురాడుదు రేరితరము
మదిని ఖేదంబు మాని యీమంచిలగ్న
మంద పీఁటకుఁ జేరుము సుందరాంగ.

108


క.

అని రుద్రుం డాలగ్నం
బుస హరి నభ్యంగనంబు మోదంబునఁ జే
యను హెచ్చరికగ లెమ్మన
విని శంభుని జూచి యాదివిష్ణుం డనియెన్.

109


సీ.

శంకర బాలభాషలు వల్క కిఁక వారి
        వారిదుఃఖంబులు వారి కెఱుక
పరులకుఁ దెలియవా బ్రహ్మప్రళయవేళ
        పరదేశినై వటపత్రమందు
నే నుండినపుడు నిత్యానపాయిని యౌచు
        నాహృదయంబును నంటియున్న
కమలాలయను దుష్టకాలముచేఁ బాసి
        ఏకాకినై యుంటి యిన్నినాళ్లు


తే.

నా కపుడు మది నొకచింత లేకయుండె
నిపుడు నేను వివాహేచ్ఛ నెంచఁగాను