పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

331


సీ.

శ్రీరస్తు బ్రహ్మ కాశీర్వాద మహిగిరి
        మీఁద మాకు శుభంబు మీకు శుభము
వ్రాయించి పంపించవలయును దర్వాత
        సురుచిరవైశాఖశుక్లదశమి
శుక్రవారమునాఁడు శుభముహూర్తంబున
        గగనాధిపతి సుతం గ్రమముగాను
గలియుగంబునం గరగ్రహణంబు చేసెద
        మేటికుటుంబసమేతముగను


తే.

రాఁ దగిన మిత్రులనుగూడి రయముగాను
వచ్చి మెఱమెచ్చ నాకు వైవాహికంబు
సేయుమని యుండ మునులు విస్మితము నొంది
రంత నాపత్త్రికను గను లద్దికొంచు.

100


వ.

అక్కమలాసనుండు శ్రీనివాసుని వైవాహంబునకు దిక్పాల
ప్రముఖులకు నుత్తరంబు వ్రాయించి రమ్మని వచించి మునులం
దోడ్కొని సకలదివ్యాభరణాలంకృతుండై సావిత్రి గాయత్రి
సరస్వతులంగూడి మదమరాళంబు నెక్కి వివిధమంగళవాద్యం
బులు చెలంగ ఖగేంద్రునితోడ వేకటాద్రికి వచ్చె నది
దెలిసి చక్రి లేచి బ్రహ్మ కెదురేగిన, యజుండు హంసవాహ
నంబును డిగి హరికి నమస్కరించినం జూచి విష్ణుం డజుని
మీఁది పుత్రవాత్సల్యం బగ్గలింప ముహూర్తద్వయంబు
గద్గదకంఠుండై మాటాడకుండి యుత నజుని నాలింగనంబు
చేసుకొని వచ్చి తింత్రిణీవృక్షమూలంబునఁ గూర్చుండం
జేసి వచ్చిన సన్మునిపుంగవులకుఁ దాఁ బ్రణమిల్లి వారికిం దగిన
యాసనంబుల నుండఁజేసి భృగుమునీంద్రుఁడు తన్నినకతన