పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

328

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


సీ.

నాతండ్రి వేంకట నారాయణపురంబు
        నకుఁ బోయివచ్చితి సకలశుభము
లొదవె వివాహమహోత్సవంబునకు నే
        నేమిపనుల్ సేయు దిచట నింక
విని హరి వల్కె నో జనని యీపెండ్లి పె
        త్తనము చేసితి వింక ద్రవ్య మేడ
దెచ్చెద వేనేడ దెత్తు దీని కుపాయ
        మేమి నా కెఱిఁగింపు మిప్పు డనిన


తే.

వకుళమాలిక పల్కె నవ్వనధితనయ
నిచ్చటికి బిల్వనంపిన నెచ్చుగాను
ధనము నీ కిచ్చు ననఁగ నవ్వనజనేత్రుఁ
డపుడు వకుళను గాంచి యిట్లనియెఁ బ్రీతి.

90


సీ.

వనజాలయను బాసి వచ్చి యిచ్చట పెండ్లి
        యాడెద ననిన నా కాప్తమగును
ధన మిచ్చునే సిరి యని పల్కి తల వాంచి
        చింతింప వకుళ యాశ్రీనివాసు
నీక్షించి వారితో నెంతయు నిజముగఁ
        జెప్పి వచ్చితిని నీ విప్పు డిట్ల
చింతనొందిన నేమి సేయుదు నీమాట
        లావరాహస్వామి కైనఁ జెప్పి


తే.

తప్ప కేమైన నొకప్రయత్నంబు చేసి
మానరక్షణ గావింప మంచిదరయ
వారు రమ్మన నపుడు ద్రవ్యంబు లేక
పెండ్లి కీరీతిఁ బోవఁ బ్రాపించు గేలి.

91