పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

327


వందనంబులు నేఁటివఱకు మాకు శుభంబు
        వఱలు మీకుశలంబు వ్రాయఁదలఁతుఁ


తే.

దనర వైశాఖమాసాదిదశమిశుక్ర
వారమునరాత్రి శుభలగ్న మారయంగ
నుంట దెల్పుటచేత మే ముల్లసముగ
వత్తు మానాఁడు పదివేలు వందనములు.

87


సీ.

అని తాను వ్రాసియున్నట్టియుత్తరమును
        శుకునకు వినిపించి చుట్టి దాని
తోఁ బుష్పహారంబు దొడరియొసంగి య
        మ్మునితోడఁ బర్వతంబును ముదంబు
నం దిగి పంపి తా నగమున కేగెను
        నారాయణవనాఖ్యనగరమునకు
జేరి మౌనీశుఁ డాభూరమణున కిచ్చె
        నతఁడంది భార్యకు నలరఁ జూపి


తే.

బంధుమిత్రారాదులకుఁ జూపి పరమముదము
నొందె నావల శుకముని యుర్విపతికి
హరివచించిన విస్మయం బైనపల్కు
లన్ని యెఱిఁగించె దేవేజ్యుఁ డనుముదంబు.

88


వ.

పొందెనంత నాకాశరాజేంద్రుఁ డాశుకమహర్షికిం ద్రిదశా
చార్యుకుం బ్రణమిల్లి సన్మానించుటం జేసి వారు తమస్థానంబుల
కేగిరి. నృపుండు పురం బలంకరింపజేయుఁడని చారులకు
నానతిచ్చె, నాధరణీదేవి వకుళమాలికకు దివ్యాంబరాభర
ణాదులచే సన్మానించి వీడ్కొలుప శేషాద్రికి వచ్చి శ్రీనివాసుని
వీక్షించి యిట్లనియె.

89