పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

323


శుకుని రప్పించి తాఁ జూచి యాతని కుచి
        తార్చనములు చేసి యమలరత్న


తే.

పీఠమునఁ జేర్చ నావలఁ బేర్మిగురుని
చూచి సంతోషచిత్తుఁడై శుకుఁడు పల్కె
నేమి యీదిన మిచ్చట నెలమి మనము
చేరుటలటంచు నృపునకుఁ జెలఁగు శుభము.

73


క.

సురగురువర న న్నిచటికి
గరుణను బిలిపించినట్టి కార్యము నాతోఁ
ద్వరగాఁ జెప్పుఁ డనంగను
గురుఁడు ముదంబొదవ నాశుకున కిట్లనియెన్.

74


సీ.

విను శుకయోగీంద్ర ఘనుఁ డైన వేంకటే
        శ్వరుఁడు పద్మావతి వలచి తాను
బెండ్లియాడెద నను బ్రేమ రెట్టింపంగ
        వకుళమాలిక యను వనిత నెసఁగ
ఘనతగఁ బెండ్లి పెత్తనము సేయుటకు నేఁ
        డంపించినాఁడు న న్నెందుకొఱకు
నృపతి రప్పింపఁగ నేను నచ్చితి నీవు
        వచ్చితి విపుడు భూవరున కేమి


తే.

చెప్పవలె నన్న గురుని వీక్షించి శుకుఁడు
పల్కె నీరాజుపుణ్యప్రభావమునన
పద్మ గల్గిన దట్టి సౌభాగ్యవతికి
దగఁడు మనుజుండు శ్రీరమాధవుఁడ గాక.

75


తే.

అని నృపాలక నీవు మహాతపంబు
చేసి యుండుటఁ జేసి లక్ష్మీసమాన