పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

314

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


క.

ఆకన్యక యీవిధమున
శోకింపఁగఁ జూచి కొంత చోద్యపడుచు నీ
కీకరణిగ నతిదుఃఖము
రాకకు గత మేమి దెల్పు రహి మాయమ్మా.

42


తే.

అమ్మ నిజముగ లోకాన నాప్తు లింక
నా కెవరు లేరు నాకన్న నీకు లేరు
నన్ను నఱమఱఁగాఁ జూడ కున్నమాట
దాఁపకయ చెప్పు మిపుడు నాతండ్రితోడె.

43


చ.

అని యిటు లానఁ బెట్టి సుత నప్పుడు మెల్లఁగ లేవనెత్త తా
ననుపమప్రేమతోడను నిజాంకతలంబున నుంచి శీర్షమున్
దనచెయిదమ్మిచే నివిరి తద్దయు లాలనఁ జేసి యడ్గగాఁ
దనతల వంచి పల్కనిసుతం గని యిట్లనె ధాత్రిదేవి తాన్.

44


ఆ.

పట్టి నీదు సాపఫలమును గా దిది
యరయ నేను జేసినట్టిపాప
ఫలము గాని నిన్ను బాధింప నేటికి
నంచు నీరు వెట్టె నక్షులందు.

45


సీ.

ఆరీతిఁ దనకొఱ కార్తిబొందిన తల్లి
        నాపడుంతుక చూచి తాప మొంది
కనుల బాష్పము లొల్కఁగా నిట్టు లనియె నో
        యమ్మ పుష్పవనంబునందు నేను
సఖులతో నాటాడుసమయాన నచటికి
        దివ్యపురుషుఁ డొక్కతేజిమీఁదఁ
దగ నెక్కి వచ్చిన న్నొగిఁజూచి యెక్కస
        క్కెము లాడె నేనట్టి గేలి కపుడు