పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

313


మగువ నే నీకుఁ జెప్పిన మాట నిజము
దబ్బ రని యెంచ కమ్మరో తనయ నడుగు.

37


వ.

అవ్వో యవ్వ కడుపుకూటికి దబ్బరాడితి నని తలంచి
యుండావే, అది కల్ల గాదు కైలాట గాదు తరకట బరకట
గాదు. తబ్బిబ్బు గాదు, తసుకు కాదు. తాటోటు మాటలు
గాదు, ఆడంబరము గాదు, ఈడెలు గాదు, ఈఱలు తాఱలు
గాదు, బొంకు గాదు, బోనకత్తెలు మాటలు గాదే యమ్మ
కూఁతును జూచి యడిగితె నిజంబు దెలస్తాదె, నామాట నా
గెద్దబుట్టతోడె నాబుడకఁడుతోడె నిజమేగాని కల్ల గాదు తల్లీ
యని దిగ్గున లేచి పోయి పరమపురుషుండైన నారాయణుండు
వేంకటాద్రియందు నిజరూపంబున నుండె నంత ధరణీదేవి
పరమాశ్చర్యంబునఁ బద్మావతికడకుం జని యిట్లనియె.

38


ఉ.

అమ్మ యిదేమి పద్మ యిపు డారటఁ బొర్లుచుఁ బవ్వళించి యీ
సొమ్మసిలంగ నేల యిఁకఁ జొప్పడ లే యిఁక నిన్ను జూచి నే
నెమ్మది నెట్టు లుండెదను నీమదిలోఁ గల మర్మ మిప్డు ని
క్కముగఁ జెప్పు నీకలికికన్నులనీ రిటు నించ నేటికే.

39


క.

నే వల దన్నను నిలువక
యావనముస కరిగి నిన్న నాటాడఁగ ని
న్భావించుచుఁ గని రెవ్వరు
నీ వెవరిం గంటి వచట నీరజనేత్రా.

40


తే.

నీవు బిడ్డవు నాకు నే నీకుఁ దల్లి
యజమఱను లేక చెప్పు నీయాత్మచింత
వింత దాఁపక యిఁకఁ జెప్పు వెఱువ నేల
యనిన నక్కన్య మాటాడ కడలసాఁగె.

41