పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

306

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


తే.

పల్కి రిట్లని తల్లి యీపట్టణమున
కొనర నెఱుకలసాని వచ్చినది దాని
నిటకు రప్పించి సుతకష్ట మేనిధమున
దీరునో తద్రహస్యంబు దెలియ నడుగు.

11


మ.

అని యాకాంతలు వల్క రాజసతి నెయ్యం బొప్పఁగా డానిఁ దో
డ్కొని రాఁ బొండని పల్కఁగా నరిగి వే కోర్కె ల్గనం దాని ర
మ్మనుచున్ గొప్పఁగ నెంచి వారు పరమాహ్లాదంబుతో నందుఁ బి
ల్చిన వేరాకయ బిడ్డఁ డేడ్చు ననుచుం జేఁదట్టి లాలించుచున్.

12


ఉ.

ఆకుఱవంజి యిట్లనియె నాటకు రమ్మని బిల్వ వచ్చి నా
రాకొనినాఁడు బిడ్డఁ డిపుఁ డమ్మల నక్కల నేడనైన నే
జోకుగఁ జేరి వారలకు సోదె నిజంబుగఁ జెప్పకుండినన్
నాకడు పెట్లు నిండునని నవ్వుచుఁ బల్కుచుఁ మూల్గి యిట్లనెన్.

13


సీ.

భాగ్యవంతులు వారు బహుపేదరాలు నే
        నెటువత్తు నచటికి నెలమి మీఱ
నాబొక్కనోరును నా తెల్లవెండ్రుకల్
        గొప్పకడుపును బెద్ద దొప్పచెపులు
గూని వీఁపును బండిగురిగింజదండలు
        దంతపుసొమ్ములు వింత దెల్పుఁ
గనుఁగొని మణుల బంగరుసొమ్ము లొగిఁ బెట్టి
        యుండువారలు నవ్వుచుంద్రు గనుక


తే.

నాకు సిగ్గగు నీరాచనగరి కేను
వచ్చుటకుఁ గార్య మేమి నావలెనె పేద