పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

305


తే.

మురిపమునఁ జూచి పలికిరో ముసలిదాన
గద్దె చెప్పుము మాకు నిక్కంబుగాను
బలుకగా నంతలో రాచచెలులు వచ్చి
యెఱుకతను జూచి వేడ్కమై నిట్టు లనిరి.

7


క.

దిట్టతనంబుగ నీ విపు
డెట్టిట్టు వచింపకుండ నెద నెన్నికలం
బట్టుగఁ జెప్పితె యెఱుకత
పట్టువలువ లిత్తు మెలమి వలుకుము సరవిన్.

8


క.

ఎఱుకత యిట్లనియెను నా
యెఱుకయ జీవనము జనులకెల్ల నెపుడు నా
యెఱుకయ శుభదము శాశ్వత
మెఱుకయ సకలప్రపంచ మెఱుకయ నేనున్.

9


సీ.

వినుఁడు నా యెఱు కెట్టిదని యంటిరేని యీ
        పంచభూతాలఁ బుట్టించు నెఱుక
సరసజాగ్రత్తకు స్వప్నంబునకు దుదఁ
        మొదలు తానై మూఁట గుదురు నెఱుక
దండిగ బ్రహ్మాండభాండతండములందు
        నిండి కుండలినంటి యుండు నెఱుక
మొనసి యాపోజ్యోతి నెనసి తాఁ దనయంద
        నిలిచి యానందించి వెలుఁగు నెఱుక


తే.

యిట్టి యెఱు కెవ్వ ఱెరుఁగ రాయెఱుక నిజము
నెఱుక నేర్చినవారి కాయెఱుక యేను
జెప్పెదను గాని మీకు నేఁ జెప్ప ననినఁ
జెలులు విని ధరణీదేవి చెంత కరిగి.

10