పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

302

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


హంబు పూని కొల్లాపురంబు సేరుటయు, హరి వైకుంఠము
విడిచి శేషాచలంబున వల్మీకంబునం జేరుటయు, బ్రహ్మరుద్రులు
ధేనువత్సరూపంబులం జని హరికి నాహారంబు నొసంగుటయు,
చోళరాజాంగన గోపకుని దండించుటయు, హరిశిరంబున గో
పకుడు గొడ్డంట నఱుకుటయు, చోళరాజుకు చక్రి శాపం
బిడుటయు, గీష్పతి హరికి నౌషధంబు చెప్పి పోవుటయు, శౌన
కాదులు హరిచరిత్రకుఁ బశ్చాత్తాప మొందుటయు, వల్మీకతిం
త్రిణీప్రభావంబును, శేషపర్వతమహిమంబును, వరాహ
శ్రీనివాసుల సంవాదంబును, హరికి వరాహస్వామి చోటిచ్చు
టయు, వకుళమాలికావృత్తాంతంబును, శ్రీమదాకాశరాజు
వృత్తాంతంబును, పద్మావతి భూమియం దుదయించుటయు,
వసంతఋతువర్ణనంబును, పద్మావతి వనవిహారంబు సేయుటయు,
నారదుండు పద్మావతితో సంభాషించి పోవుటయును, శ్రీని
వాసుండు వేఁటాడుటయు, హరి కరిని రక్షించుటయు, వన
మధ్యంబునఁ బద్మావతిని హరి చూచి తనయుదంతం బంతయుఁ
జెప్పుటయు, పద్మావతి కలహించి చెలులచేత హరిపై ఱాల
రువ్వించుటను, హరి గిరి కేగి వల్మీకంబునఁ జొచ్చుటయు,
వకుళమాలిక హరిని ప్రియంబున మాటాడించుటయు, హరి
యెట్టకేలకు వకుళకుం దననిజంబు వక్కాణించుటయు,
రామకథయు, వేదవతీవృత్తాంతంబును, నారాయణవనపుర
వర్ణనంబును, పద్మావతి గృహంబున కరిగి హరిం దలంచుకొని
తాపజ్వరం బనుభవించుటయు, వకుళ నాకాయణవనపురి
కేగి పద్మావతి చెలికత్తెం జూచి మాటాడుటయు ననుకథలంగల
చతుర్థాశ్వాసము.