పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

300

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


పోక తాపంబుచేఁ బొరలుచు నుండె మీ
        రిది మాన్ప నౌషధం బియ్యవలయు
నన విని గురుఁ డిట్టు లనియె నృపాల యీ
        బాలామణికిఁ బ్రాణభయము లేదు
చింతంపవలదు చెచ్చెరను రుద్రాభిషే
        కంబు సేయింపుఁడు కల్గు సుఖము


తే.

నీవు చేయింపుమని వల్క భూవిభుండు
బ్రాహ్మణుల నిచ్చటికిఁ బంపి ఫలసుమములు
గొనుచు పొమ్మని నాచేతఁ గోవెలకును
జెప్ప వచ్చితి నవి గొని చింత నిదియ
నింక నీ వెందు వచ్చితో నెఱుఁగఁ జెపుమ.

356


వ.

అనిన విని వకుళ మనంబునఁ దలంచిన కార్యం బనుకూలము
నకు వచ్చినదని సంతసించుచు సవ్వెలఁది కిట్లనియె.

357


సీ.

విను మోలతాంగి నే వేంకటేశునిదాసి
        యొకకార్యమునకు ని ట్లుదయమునన
పైనమైవచ్చితిఁ బట్టణం బిఁకఁ జేరి
        యంతరంగంబున కరిగి యచట
నాధరణీదేవి కాప్తవాక్యము చెప్ప
        వచ్చితి ననఁగ నవ్వనిత పల్
నభవుని కభిషేకమగునంత కిచ్చోట
        నిల్చియుండితివేని నేను నిన్ను


తే.

దోడుకొనిపోదు నన దానితోడుకొఱకు
వకుళ యచ్చటనుండె నవ్వల ఫణీంద్ర