పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

297


తించి యవ్వలంబోయి శుకాశ్రమంబు చేరి యం దాశుక
యోగీంద్రులకు మ్రొక్కి అగస్త్యాశ్రమంబున కరిగి యం
దమ్మునివలన నిర్మింపఁబడిన శివునకు నమస్కరించి తదాలయ
సన్నికృష్ణగ్రామనివాసు లగు బ్రాహ్మణులకు మ్రొక్కి వారి
నారీమణులను గూడి మైత్రి యొనరించుకొని నారాయణవన
పురంబునకుఁ బోయి తద్రాజపత్ని కడకేగి యయ్యంగనామణిం
జూచి ప్రియోక్తులాడుచు నావలఁ బద్మావతిసంగతి నించుక
దెల్పించుము. జరుగు కార్యం బావల జరుగుననిన వకుళ
మాలిక విని యిట్లనియె.

349


సీ.

విను దేవ! వారు నీవృత్తాంత మడిగిన
        నప్పు డే నేమేమి చెప్పవలయు
నని పల్క నాయంబుజాక్షుండు గనుఁగొని
        యనియె నోయమ్మ వా రడిగిరేని
వరచంద్రకులజులౌ వసుదేవకులు ధాత్రి
        తలమున నాతల్లిదండ్రు లనుము
బలభద్రుఁ డన్న సుభద్ర సోదరియును
        గోత్ర మడ్గ వసిష్ఠగోత్ర మనుము


తే.

రహిని నక్షత్ర మడిగిన శ్రవణ మనుము
లలితయౌవనసౌందర్యకలితుఁ డనుము
మానధనుఁ డను భవ్యనిధానుఁ డనుము
భువిని బద్మావతికిఁ దగు పుర్షుఁ డనుము.

350

వకుళమాలిక నారాయణవనపురమున కేగుట

వ.

అని చెప్పుచుండఁగ దేవమాయానిర్మితం బగుతురంగంబు
కయంబున హరికడకు వచ్చి నిలుచుటం జేసి వకుళమాలిక