పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

292

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


వతి లంక చేరి రావణునిచే హింసలు
        వడియె నాకొఱ కిది భాగ్యవతియు


తే.

నిన్నుఁ గోరి తపంబున్న కన్నె మిన్న
గనుక నీభావమందు సత్కరుణనుంచి
ప్రేమ మీరఁగ నిద్దానిఁ బెండ్లియాడు
మనఁగ నే నందు కొల్ల కిట్లంటి నపుడు.

331


తే.

పడఁతి విను మేకపత్నీవ్రతుఁడను గనుక
యిపుడు నేఁ బెండ్లియాడ నియ్యిందుముఖిని
రహిఁ జెలంగఁగ దేహాంతరమున దీని
పెండ్లియాడుదు వేడుక పెచ్చుపెరుఁగ.

332


వ.

అదెట్లనిన నిరువైయెనిమిదవద్వాపరాంతకలియుగంబున
ననేకభక్తరక్షణార్థంబు వేంకటాద్రియందు నవతరింతు నపు
డీకన్యకను బెండ్లియాడుదు. నంతపర్యంతంబు నీకాంత సత్య
లోకంబున వసియించి యుండవలయు, వేంకటాద్రియం దుద
యించిన నపు డియ్యింతి భూమియందు నుద్భవించు. నపు
డేను పరిగ్రహింతు.

333


క.

అని పల్కితి నీగోప్యం
బనలునకును నాకుఁ దెలియు నదిగా కిది యా
జనకజకును వేదవతికిఁ
దసరారఁగఁ దెలియు మర్మధర్మం బిదియున్.

334


సీ.

పరు లెందు వినని నీపరమరహస్యంబు
        నీకుఁ జెప్పితి నేఁడు నెనరు మీఱి
మది నుంచు మటుమీఁద మహిమ మీరఁగ నేను:
        వహ్నియం దావేదవతిని నిల్పి