పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

291


నేమ మొకించుక దప్పక
యామానిని చెఱను నిల్చి యడలుచు నుండెన్.

328


క.

అనలుఁడు తనసతిచెంగట
నొనరఁగ జనకజను డాఁచియుండఁగ నే నా
యనిమిషవైరిని దునుముట
కనిమిషపతి సుతుని ద్రుంచి యాసుగ్రీవున్.

329


సీ.

చేబట్టి లవణాబ్ధి చెచ్చెర బంధించి
        కదసి రావణకుంభకర్ణముఖ్యు
లగురాక్షసులం ద్రుంచి యందఱు మెచ్చుట
        కై యందుఁ జెరనుండునట్టిసతిని
గాంచి నీవగ్నిలోఁగాఁ బ్రవేశించి వ
        చ్చినఁ గాని నిన్నుఁ జేకొన నటంచుఁ
బల్కితి నయ్యింతి పావకజ్వాలల
        యందుఁ బ్రవేశించె నందఱు గన


తే.

నప్పు డిద్దఱు సీతలై యగ్నియందు
నిలిచియుండఁగ జనకజ నేను చిలిచి
చేడె నీవలెఁ జెంతను జేరియున్న
కమలలోచన యెవతె నిక్కముగఁ దెల్పు.

330


సీ.

అన విని సీత యిట్లనె దశాస్యుఁడు నన్ను
        దెచ్చునప్పుడు నేను దిగులునొంది
పరఁగ ని న్బేర్కొని పలువిధంబుల నేడ్వ
        ననలుండు దనచెంత నప్పుడున్న
వేదవతిని దెచ్చి విబుధాహితున కిచ్చి
        నను దనలో డాఁచికొనియె వేద