పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

290

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


చేరి మజ్జనకాజ్ఞ శిరసావహించి సీ
        తను లక్ష్మణుని దోడుకొని వనముల


తే.

కరిగి యందుండ నొక్కమాయామృగంబు
నచట జానకి చూచి నెయ్యమున దాని
దెచ్చి యిమ్మని యడుగ మే మచ్చటుండి
పోవ దశకంధరుఁడు వచ్చి పొలఁతిఁ జూచి.

325


సీ.

ధరణిజ నెత్తి రథంబుపై నిడుకొని
        జనఁగ రామా యని జనకపుత్త్రి
విలపింప నెసవరందు విడిపింపలేకున్న
        నపు డగ్నిదేవుఁ డయ్యనిమిషారిఁ
జేరి దశగ్రీవ సీత గా దీకాంత
        మఱి యెవ్వరన్న నెమ్మదిగ వినుము
చెప్పెద రాముఁ డాసీతను నాచెంతఁ
        జేర్చి విప్రాంగన న్సీతవలెను


తే.

జేసి యందుంచి చనియె నీస్నేహ మేను
గోగి చెప్పితి నీరీతి గుట్టటంచు
శాంతముగఁ జెప్పి సీతవేషంబు వేద
వతికిఁ గల్పించి తెచ్చి రావణుని కిచ్చె.

326


క.

ఆమూఢుం డగు రావణుఁ
డామైథిలి నచట విడచి యావేదవతిం
గామించి తోడుకొని చనె
నేమఱక యశోకవనిని యెలమిగ నుంచెన్.

327


క.

రామా యని పేర్కొంచును
దా మైథిలిరీతి నచటఁ దల్లడఁబడుచున్