పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

289


బుద్ధి నిచ్చి నా కింతకష్టంబు వెట్టె మత్పాతకం బింతకుఁ దెచ్చె
బ్రహ్మయు నక్కాంతకును నా కప్పుడ సంధింపఁజేయకపోయె,
నైన నీవు తత్కన్యకారత్నంబును నాకు నొడఁగూర్పు
బ్రహ్మతంత్రంబును దోడ్పడ నెంచెద, నట్లు చేసితివేని మజ్జననీ
జనకసహోదరాదిబాంధవులును, మద్భక్తులగు ప్రహ్లాదనార
దాదిపరమభాగవతోత్తములును, నీవ యని నిశ్చయింతు,
ననేకగోభూహిరణ్యాన్నదానాదులఫలంబు చేకుఱు, నాచేఁ
బద్మావతికంఠంబున మాంగల్యం బిడంజేయు మంతియ చాలు
నని మఱియు నిట్లనియె.

322


తే.

తగిన శుభలగ్నమున నాకు దాని కీవు
పెండ్లి చేయించినంతకుఁ బ్రీతి నాకుఁ
గలుగ దేలోక మెందైనఁ గనుక వేగ
నాకుఁ బెండిలి సేయించు నయనిధాన.

323


మ.

హరి వేడ్కన్ వచియింప నవ్వకుళ నెయ్యం బారఁగాఁ బుత్త్రకా
పరమాశ్చర్యముగా ధరాతలములోఁ బద్మంబునం దట్టిసుం
దరి బుట్టం దగు హేతు వే మిపుడు మోదం బొప్పఁగా నాకు నీ
వొరిమం జెప్పుమటన్నఁ జూచి హరి యి ట్లిప్పారఁగాఁ బల్కె దాన్.

324

హరి వకుళకు రాములకథ చెప్పుట

సీ.

వినవమ్మ తొలికాలమున నప్డు త్రేతాయు
        గంబును జరుగ శ్రీకరుఁడు ఘనుఁడు
దశరథేశ్వరునకుఁ దనయుండనై పుట్టి
        గాధేయుసవనంబు గాచి శివుని
చాపంబుఁ ద్రుంచి యాజనకాత్మజను బెండ్లి
        యాడి సాకేతాఖ్య నగుపురంబు