పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీవేంకటాచలమాహాత్మ్యము

291


క.

పంకజలోచనుఁ డుండఁగ
సంకటపడి వళుళ చాల జాలిని బల్కెన్
మంకుతనము చేసెదవా
వెంకట నీమదిని యేమొ వింత జనించెన్.

304


మ.

అని యాకాంత మఱిట్లు వల్కె విను నీ వాకాన నెందేనియై
నను సౌందర్యవిలాసవిభ్రమకళానైపుణ్యము ల్గల్గుకాం
తను మోహంబునఁ జూచి వచ్చితివె? చిత్తంబందుఁ దద్రూపమున్
ఘనమై నిల్చెనొ నీయురఃస్థలమునన్ గామాస్త్రము ల్నాటెనో.

305


సీ.

నాతండ్రి నీవు గన్నది కిన్నరాంగనో
        గీర్వాణకాంతయో గిరులయందు
గమనింపఁ జెంచితో గంధర్వకాంతయో
        వనదేవతయొ లేక వగలుగుల్కు
నూర్వశియో మేనకో సర్వగుణములఁ
        దగినరంభయొ తిలోత్తమ ఘృతాచొ
పూని యీపదుగురలో నెవ్వరిం జూచి
        నీవు వచ్చితి వది నిక్కముగను


తే.

జెప్పుమని వల్కఁ దల వంచి శ్రీధరుండు
పలుక కూరక కనుల బాష్పంబు లొల్క
దిగులువడియుండుచక్రిని తగ మఱొక్క
సారి వీక్షించి పల్కె నో సత్కుమార.

306


తే.

మోహినీభూత మేమైన ముందు నిలిచి
కనులఁ బొడఁగట్టి పోయెనో గహనమందుఁ