పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

268

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


నంబు లలరారుచున్నవి యఖలశుభము
లొనరు నివి చేతఁ గలకాల ముర్వి నీకు.

242


తే.

మఱియు నిట్లనెఁ గిసలయమార్దవంబు
గలిగియుండెడు నీవామకరమునందుఁ
గాంతి నొప్పుచు నిత్యమాంగళ్యరేఖ
వఱలుచున్నది చూడు భూవరకుమారి.

243


క.

ఈ రేఖ లుండుబలమున
నారాయణుఁ డెలమి నీకు నాథుం డగు నీ
గోరిక ఫలియించును పో
శ్రీరామామణిగ నుండు చెలఁగుచు నమ్మా.

244


సీ.

అనుచుఁ బద్మావతి కమ్ముని సర్వాంగ
        సౌందర్యకలితలక్షణములన్ని
బాగుగఁ జెప్పి తా నేగె నాదినమున
        నంబుజాక్షుఁడు వేంకటాద్రిమీఁద
నుదయకాలంబునం దొనరంగ భుజియించి
        కడు వేడ్కఁ బసిఁడిచల్లడము దొడిగి
కొనలందు ముత్యాలకుచ్చు లొప్పినదట్టి
        తవరంగ తననడుమున బిగించి


తే.

కురులు సవరించి విరులతోఁ గొండెఁ గట్టి
మేలు చందురుగావిరుమాలఁ జుట్టి
సరిగెజిగివల్వ మేన మెచ్చంగఁ దాల్చి
మెఱయుభూషలు నొడలపై మెఱయఁజేసి.

245


క.

తిరుమణిఁ దిరుచూర్ణము శ్రీ
కరము లలాటమునఁ దీర్చి గంద మలఁది బం