పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

240

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


వనితకుఁ గోరినవిత్తం
బనుపమగతి నిచ్చి కొనియె నావున్ దూడన్.

151


వ.

అట్లు కొని మున్ను తమకుండిన ద్విసహస్రధేనుగణం
బులలోఁ దోలి గోపకుని కొప్పించె నంత నమ్మహాలక్ష్మి యజ
హరులు ధేనువత్సరూపంబులను ధరించి వల్మీకవాసి యగు
వాసుదేవుని బోషింతు రింక నాకు నొకచింత లే దీస్వామి
యెందైన సుఖించుచుండుట చాలునని తలంచి కొల్లాపురం
బున కరిగె నంత బ్రహ్మస్వరూపం బైనధేనువు దినదినమున.

152


క.

గోవులలో మేయుచుఁ జని
శ్రీవేంకటశైల మెక్కి క్షీరంబును దా
నావల్మీకములోపలి
శ్రీవిష్ణుని కర్పణంబు సేయుచు నుండెన్.

153


క.

హరి యాక్షీరము ద్రావుచుఁ
బరమానందంబు నొంది బ్రహను రుద్రున్
మురియుచు మెచ్చుచు నుండిన
తఱిఁ జోళనృపాలుభార్య తనబిడ్డకుగాన్.

154


తే.

మున్ను తాఁగొన్నదూడతో మొదవునపుడు
సదనమున కొప్పఁ దెప్పించి సాధ్వి గోవు
దానిమేనెల్ల నివురుచుఁ దాను దాని
పిండఁబోవఁగఁ బాలులే కుండఁగాను.

155


తే.

తాను దనమదిలో నిట్లు దలఁచె నావు
పొదువు యోచించి చూచినఁ బూర్ణకలశ
మట్ల మెఱయుచు నుండియం దద్భుతముగ
బాలు లేకున్న దిది యేమి పాప మనుచు.

156