పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

239


సీ.

కపిలవర్ణంబుతోఁ గర మొప్పుదేహంబు
        మంగళకరమైన శృంగములుసు
కాటుకకనులు సింగారంపుఁ జెవులును
        నల్లనై మెఱసెడు నాసికయును
గురుతరకంఠంబు గోపురం బుదరంబు
        తగుదీర్ఘవాలంబు తక్కుచూపు
ద్విరదతుండములట్ల దీపించుతొడలును
        పూర్ణకుంభాభమై పొసఁగుపొదుగు


తే.

బటువు లైనట్టి కదళికాఫలములట్ల
నునుపుగా నొప్పు నాల్గుచన్నులును గల్గి
క్షీరవారిధిలోఁ బుట్టి చెలఁగినట్టి
కామధేనువువలె లక్ష్మికడకు వచ్చె.

148


తే.

వత్సరూపంబుఁ దాల్చె నీశ్వరుఁడు సరవి
ధవళరూపంబు మెఱయగఁ దల్లిచెంతఁ
బాలు ద్రావుచు నెగరుచు బాల్యలీల
లరుదుగాఁ జూపఁగాఁ జూచి యాదిలక్ష్మి.

149


చ.

కమలజు శంభు లీక్రమముగా హరి కిష్టము సేయుకోర్కెతో
నమలినధేనువత్సయుతు లైనవిధంబు మనంబులోపలన్
గ్రమముగ నందుఁ దా నెఱిఁగి గ్రక్కున రెంటిని దోలి తెచ్చి పెం
పమరఁగ దూడనావు నపు డమ్మెదనంచు వచించుచుండగన్.

150


క.

విని చోళనృపాలుని సతి
తనబిడ్డకుఁ బాలు దాను ద్రాగించుట కా