పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

230

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


సీ.

పరమమునీశ మీ వచ్చుటఁ దెలియక
        యూరక పవళించి యుంటిఁ గనుక
యపచారినైతి నాయందుఁ గృపాకటా
        క్షం బుంచవలయు నోసంయమివర
నాయపచారంబునకుఁ దగుశిక్షకై
        యెఱిఁగి తన్నితిరి నా కిష్టమాయెఁ
గఠినమైన వక్షమునందుఁ దన్న మీ
        పద మెంత నొచ్చెనోగద యటంచు


తే.

నేమి సేయుదు మృదువైన దీపదంబు
చిగురుటాకులవంటి సేవ్యమైన
దిట్టిపాదము తాఁకిన నెదను నొప్పి
లేదు యోగీశ కోపము లేదు నాకు.

114


క.

వనజముఁ దాఁకినచందం
బున మీపదఘాత మెదను భూషణ మయ్యెన్
ఘనకఠినతరోరస్థల
మెనయఁగఁ దాఁకినపదాబ్జ మెట్లుండెనొకో.

115


వ.

అని వల్కి యమ్మునీంద్రుని పాదప్రక్షాళనంబు చేసి తత్తీర్థంబు
శిరంబునం జల్లికొని యిట్లనియె.

116


క.

వరవిప్రునిపదరేణువు
లిరవుగ శిరమున ధరింతు నీనాఁటికి మీ
చరణం బురమున సోఁకఁగ
ధరణీసురవర్య నేఁడు ధన్యుఁడ నైతిన్.

117


ఉ.

అని హరి పల్కఁగా భృగుమహాముని సంతసమంది మానసం
బున భయభక్తులం బొడమ పుండరీకాక్షునిమోము చూచి ల